సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు
By - TV5 Telugu |12 July 2020 2:49 PM GMT
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి బోనాలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో.. భక్తులు లేకుండా అధికారులు, అర్చకుల సమక్షంలో మాత్రమే బోనాల వేడుక నిర్వహిస్తున్నారు. భక్తులందరూ తమ తమ ఇళ్లలోనే బోనాలు సమర్పించుకుంటున్నారు. బోనాల వేడుక ఇలా జరగటం ఇదే మొదటిసారి. బోనాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com