బీజేపీలోకి కొనసాగుతున్న వలసలు.. మరో ఎమ్మెల్యే..
By - TV5 Telugu |12 July 2020 5:45 PM GMT
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి వలసలు ఇంకా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియా తన వర్గంతో కలిసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి.. శివరాజ్ సింగ్ చౌహన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు తాజాగా.. బడా మల్హెర నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రద్యుమ్న సింగ్ లోథి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసారు. దీంతో ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల కేబినేట్ విస్తరణలో కాంగ్రెస్ నేతలకు పెద్దపీట వేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com