వరుసగా 8వ రోజు 22 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు

వరుసగా 8వ రోజు 22 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వారం రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వరుసగా 8వ రోజు 22 వేలకు పైగా కొత్త కేసులు రికార్డయ్యాయి.

శనివారం ఒక్కరోజే కొత్తగా 27,114 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,20,916కు చేరింది. కోలుకున్న రోగుల సంఖ్య 5,15,385కు చేరగా, 2,83,407 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో కోలుకున్న రోగుల శాతం 62.78కి చేరింది. తాజాగా 519 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 22,123కు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story