దేశంలో కరోనాతో ఒక్కరోజే 500 మంది మృతి
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ కరోనా మహమ్మారి కారణంగా గత వారం రోజులుగా దేశంలో 25 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోవదవుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,701 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,78,254కు చేరింది.
ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 3,01,609 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 5,53,471 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఒక్కరోజే 500 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 23,174కు పెరిగింది. గత 24 గంటల్లో 18850 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com