సోనూసూద్ మరోసారి.. 400 కుటుంబాలకు..

సోనూసూద్ మరోసారి.. 400 కుటుంబాలకు..

బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కరోనా వైరస్, లాక్‌డౌన్‌ సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన వలస కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తమ స్వస్థలాలకు చేరుకునే సమయంలో చాలా మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులను ఇప్పటికే ఈ విషయమై సంప్రదించారు. ప్రాణాలు కోల్పోయిన వలస కార్మికుల సమాచారం, బ్యాంకు వివరాలు తెలుసుకున్నారు. సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని సోనూ సోమవారం ప్రకటించారు. కాగా, సోనూ లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులను తమ స్వస్థలాలకు చేరవేసేందుకు ప్రత్యేకంగా బస్సులను, చార్టెడ్ ప్లైట్ లను ఏర్పాటు చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story