ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1,919 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అంతకంతకూ విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో
19,247 సాంపిల్స్ ని పరీక్షించగా 1,919 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
అలాగే కొత్తగా 1030 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ అరోగ్యంతో డిశ్చార్ట్ అయ్యారు.
కోవిడ్ వల్ల అనంతపూర్ లో ఆరుగురు, కర్నూల్ లో నలుగురు. తూర్పు గోదావరి లో నలుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు, చిత్తూర్ లో ముగ్గురు, గుంటూరు లో ముగ్గురు, కృష్ణలో ముగ్గరు ,
ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఇద్దరు. నెల్లూరు లో ఇద్దరు, శ్రీకాకుళం లో ఒక్కరు, విశాఖపట్నం లో ఒక్కరు, విజయనగరం లో మరొకరు మరణించారు. నేటివరకు రాష్ట్రంలో 11,73,096 సాంపిల్స్ ని పరీక్షించారు. రాష్ట్రంలో 11,958 మంది ఆసుపత్రులలో మరియు 2,316 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో వెరసి మొత్తం 14,274 మంది చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 28,255 పాజిటివ్ కేసు లకు గాను.. 14,275 మంది డిశ్చార్జ్ కాగా.. 365 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 13,615 గా ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com