సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల

సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల

సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదలైయ్యాయి. కొన్ని సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు జరిపి.. కరోనా కారణంగా మిగిలిన సబ్జెక్టులు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా ప్రభావం రోజురోజుకూ పెరగడంతో.. ఆ పరీక్షలు రద్దు చేశారు. అయితే, క్లాసులో విద్యార్థుల ప్రతిభ, ఇంటరనల్ మార్కుల ఆధారంగా ఈ సబ్జెక్టులకు గ్రేడులు కేటాయించారు. సోమవారం ఇంటర్ ఫలితాలు ప్రకటించగా.. 10వ తరగతి ఫలితాలు బుధవారం విడుదల చేశారు. మొత్తం ఈ సంవత్సరం 18 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఫలితాలను www.cbseresults.nic, www.cbse.nic.in వెబ్‌సైట్లలో చూసుకోవాలని కేంద్రం తెలిపింది. ఉమాండ్‌ మొబైల్‌ యాప్‌, 011-24300699 టోల్ ‌ఫ్రీ నంబర్‌ ద్వారా ఫలితాలు‌ తెలుసుకోవచ్చని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story