సెల్ఫ్ క్వారంటైన్లో కేంద్రమంత్రి
By - TV5 Telugu |14 July 2020 9:23 PM GMT
జమ్మూ కశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనాకు కరోనా సోకడంతో కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఈ నెల 12న రవీందర్ రైనా.. కేంద్రమంత్రితో సమావేశమయ్యారు. అయితే, తాజాగా ఆయనకు కరోనా సోకిందని వైద్యులు వెల్లడించారు. దీంతో జితేంద్ర సింగ్ ఈ రోజు సాయంత్రం నుంచి సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ఈవిషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా.. కరోనా బారినపడిన రవీందర్ రైనా శ్రీ మాత వైష్ణోదేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం తనకు జ్వరం వచ్చిందని.. దీంతో కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్ అని తేలిందని అన్నారు. కానీ, తనకు కరోనా లక్షణాలు ఏమీ లేవని అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com