కొత్త జిల్లాల ఏర్పాటు అధ్యయన కమిటీ సభ్యులు వీరే..

కొత్త జిల్లాల ఏర్పాటు అధ్యయన కమిటీ సభ్యులు వీరే..

కొత్త జిల్లాల ఏర్పాటుకై అధ్యయన కమిటీని ఏర్పాటు చేసేందుకు ఇవాళ ఏపీ కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు కానున్న ఈ కమిటీలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి, సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్‌ విభాగం సెక్రటరీ, కన్వీనర్‌గా ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సభ్యులుగా ఉండనున్నారు. కాగా రాష్ట్రంలో 25 - 26 జిల్లాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ

అధ్యయనం చేయనుంది. కాగా ఏపీలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తానని జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జిల్లాలు అవుతాయని భావిస్తున్న పార్లమెంటు నియోజకవర్గాలు ఇలా ఉన్నాయి. అనంతపురం , హిందూపురం, చిత్తూరు , తిరుపతి, కడప, రాజంపేట, కర్నూల్ , నంద్యాల , నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, మచిలీపట్టణం, ఏలూరు, నరసాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, అనకాపల్లి, విశాఖపట్నం, అరకు, విజయనగరం, శ్రీకాకుళం లు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story