కరోనా హాస్పిటల్‌లో పందుల స్వైర విహారం

కరోనా హాస్పిటల్‌లో పందుల స్వైర విహారం

కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఓ హాస్పిటల్‌లో పందులు స్వేచ్చగా తిరుగుతున్నాయి. ఒకటి, రెండు కాదు పదుల సంఖ్యలో పందులు గుంపులుగా హాస్పిటల్‌లో తిరుగుతున్నాయి. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

కలబురగి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రంగ 'కొవిడ్‌-19' హాస్పిటల్‌లో నల్ల పందుల గుంపు స్వేచ్ఛగా నడుచుకుంటూ వెళుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ ఘటనపై గుల్బర్గా డిప్యూటీ కమిషనర్‌ స్పందిచారు. పందుల యజమానిపై కేసు నమోదు చేయాలని పోలీసులను డిప్యూటీ కమిషనర్‌ ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story