కరోనాతో బీజేపీ ఎమ్మెల్సీ మృతి

కరోనాతో బీజేపీ ఎమ్మెల్సీ మృతి

కరోనాతో బీహార్ లో బీజేపీ ఎమ్మెల్సీ మృతి చెందారు. సునీల్ కుమార్ సింగ్ బీజేపీ ఎమ్మెల్సీ కరోనాతో మరణించారు. ఈ నెల 13న సునీల్ కుమార్ కు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. దీంతో ఆయన ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. మధుమేహం, బీపీతో బాధపడుతున్న సునీల్ కుమార్ చికిత్స పొందుతూ మృతిచెందారు. బీహార్ లో కరోనాతో మరణించిన మొదటి ప్రజాప్రతినిధిగా సునీల్ కుమార్ నిలిచారు. బీహార్ లో గత కొన్ని రోజుల నుంచి కరోనా తీవ్రమవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తో పాటు కేంద్ర ప్రతినిధి బృందం బీహార్ రాష్ట్రాన్ని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఎమ్మెల్సీ మృతిపై సీఎం నితీష్ కుమార్ సంతాపం తెలిపారు. అటు, బీజేపీ నేతలు పలువురు ఎమ్మెల్సీ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story