శ్రీనగర్లో కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
By - TV5 Telugu |25 July 2020 2:22 PM GMT
జమ్మూకశ్మీర్లోని సరిహద్దుల్లో ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. శ్రీనగర్లో శనివారం ఉగ్ర మూకలకు, జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. శ్రీనగర్ శివార్లలోని ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా.. వారిద్దరినీ ఇంకా గుర్తించలేదు. అదే ప్రాంతంలో మరింతమంది ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఇంకా గాలింపు చర్యలు జరుగున్నారని అధికారులు చెబుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com