ప్రధాని మోదీకి అమరావతి మట్టి, నీరు పంపిన రైతులు

ప్రధాని మోదీకి అమరావతి మట్టి, నీరు పంపిన రైతులు

రాజధాని శంకుస్థాపన సమయంలో ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి మట్టి, నీరు తీసుకువస్తే.. అయోధ్య రామమందిర శంకుస్థాపనకోసం రైతులు అమరావతి మట్టి, నీరు పంపిస్తున్నారు. ఆంధ్రుల కలల రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతం ఉద్దండరాయునిపాలెం నుంచి రైతులు సేకరించిన మట్టి, నీరును మోదీకి పంపిస్తున్నారు. తమకు అన్యాయం జరిగినా.. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం పవిత్రమైన అమరావతి మట్టి, నీరు పంపించడం చూసి రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story