ఢిల్లీలో కరోనా తగ్గుముఖం.. గడిచిన 24 గంటల్లో 1195 కేసులు

ఢిల్లీలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1195 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,35,598కు చేరింది. కాగా.. ఇప్పటి వరకు ఇంకా 10,705 మంది మాత్రమే చికిత్స పోందుతున్నారు. మిగాతా వారంతా కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీనిపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ.. రోజువారి నమోదవుతున్న కేసుల్లో ఢిల్లీ 12వ స్థానానికి చేరుకుందని అన్నారు. గ‌డిచిన 21 రోజుల్లో ఢిల్లీలో కరోనా ప్రభావం బాగా తగ్గిందని అన్నారు. అయితే, గడిచిన నెలరోజుల్లోనే దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని అన్నారు. మ‌హారాష్ర్ట త‌ర్వాత ఢిల్లీలోనే ఎక్కువగా కరోనా కేసులు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం రోగులు ఎక్కువ సంఖ్యలో కోలుకుంటున్నారని అన్నారు. రాష్ర్టంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టినా ఢిల్లీ స‌రిహ‌ద్దు ప్రాంతాలైన నోయిడా, ఘ‌జియాబాద్, హ‌ర్యానాల‌లో కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయ‌ని మంత్రి వివ‌రించారు.

Tags

Read MoreRead Less
Next Story