దేశంలో ఒక్కరోజే కరోనాతో 853 మంది మృతి

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దేశంలో గత మూడు రోజులుగా ప్రతిరోజూ అర లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 54 వేలకుపైగా మందికి కరోనా సోకింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షలు దాటింది. తాజగా దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 54,736 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,50,724కి చేరాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 5,67,730 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 11,45,630 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్కరోజే కరోనా వల్ల కొత్తగా 853 మంది ప్రాణాలు కోల్పాయారు. కరోనా వైరస్ వల్ల ఒకేరోజులో ఇంత పెద్ద సంఖ్యలో మరణించడం ఇదే మొదటిసారి. దీంతో కరోనా మృతులు సంఖ్య 37,364కు చేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com