కరోనా : ఏపీలో 24 గంటల్లో 6,272 మంది డిశ్చార్జ్

ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 52,834
శాంపిల్స్ ని పరీక్షించగా 8,555 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
కోవిద్ వల్ల కృష్ణ లో పదకొండు మంది, గుంటూరు లో ఎనిమిది మంది, తూర్పు
గోదావరి లో ఏడుగురు. విశాఖపట్నం లో ఏడుగురు, కర్నూల్ లో ఆరుగురు, నెల్లూరు లో
ఆరుగురు, శ్రీకాకుళం లో ఐదుగురు, ప్రకాశం లో నలుగురు, చిత్తూరు లో ముగ్గురు,
కడప లో ముగ్గురు,
విజయనగరం లో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, పశ్చిమ గోదావరి లో ఇద్దరు మరణించారు. గడచిన 24 గంటల్లో 6,272 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇవలివరకూ రాష్ట్రంలో 20,65,407 సాంపిల్స్ ని పరీక్షించారు. ఇదిలావుంటే రాష్ట్రంలో నమోదైన మొత్తం 1,55,869 పాజిటివ్ కేసులకు గాను 79,991 మంది డిశ్చార్జ్ కాగా.. 1,474 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 74,404 గా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com