24 గంటల్లో 64వేలు.. నిన్న ఒక్కరోజే అత్యధికంగా..

24 గంటల్లో 64వేలు.. నిన్న ఒక్కరోజే అత్యధికంగా..

కరోనా సోకి మరణిస్తున్న కేసుల సంఖ్య కొంతైతే.. దేశంలో ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయి గత కొంతకాలంగా.. ఇక కరోనా కేసు విషయానికి వస్తే ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా 1007 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. ప్రపంచంలో కరోనా మరణాలు అత్యధికంగా సంభవిస్తోన్న దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉంది. పాజిటివ్ కేసుల విషయానికి వస్తే దేశంలో వరుసగా నాలుగోరోజు 60 వేల కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 22,15,074కు చేరుకుంది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 15 లక్షల 35వేల మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 65 శాతానికి చేరింది. అమెరికా తరువాత బ్రెజిల్, భారత్ లలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story