ఢిల్లీలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. 707 కొత్త కేసులు
By - TV5 Telugu |10 Aug 2020 10:46 PM GMT
ఢిల్లీలో కరోనా తీవ్రగా తగ్గుతుంది. రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గడంతో ఢిల్లీ.. మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 707 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,46,134కు చేరింది. అటు, ఈ రోజు 20 మంది కరోనాతో చనిపోగా.. మరణాల సంఖ్య 4,131కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 1,31,657 మంది కోలుకోగా.. ప్రస్తుతం 10,346 మంది చికిత్స పొందుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com