రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం
By - TV5 Telugu |13 Aug 2020 9:41 AM GMT
రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. యూరియా కావాలంటే.. బయో ఫర్టిలైజర్ కూడా కొనాలనే కండిషన్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. రసాయనికి ఎరువులు నియంత్రించడానికి ఇలాంటి చర్యలు తీసుకోవాలని కేంద్రం నియమించిన టాస్క్ఫోర్స్ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.
రైతు యూరియా కొనాలంటే దాంతోపాటే ఏదైనా జీవ ఎరువు కూడా కొనేలా నిబంధన పెట్టాలని సూచించినట్టు కేంద్రవ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఎరువులు చల్లకుండా నీటితో కలిపి డ్రిప్ద్వారా అందిస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. దీనివలన 30నుంచి 40శాతం పోషకాలను కాపాడవచ్చని, సుమారు 50శాతం నీటిని కూడా ఆదాచేయవచ్చని సమాచారం
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com