కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా నెగిటివ్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా నెగిటివ్

కేంద్రహోం మంత్రి అమిత్ షాకు కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. ఆగస్టు 2న ఆయకు కరోనా సోకగా.. ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు ఆయనకు చికిత్స అందించారు. కాగా ఈ రోజు మరోసారి కరోనా పరీక్ష చేయగా.. నెగిటివ్ అని తేలింది. ఇటీవల ఆయనకు నెగిటివ్ వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. అయితే, దీనిపై స్పందించిన హోం మంత్రిత్వ శాఖ కార్యలయం ఈ వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. కాగా.. శుక్రవారం ఆయనకు కరోనా నెగిటివ్ అని వచ్చిందని డాక్టర్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story