వైసీపీ ఎమ్మెల్సీకి చెందిన 26.89 లక్షలు స్వాధీనం
By - Subba Reddy |5 March 2023 7:15 AM GMT
చోడవరం మండలం జన్నవరానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ కంచిపాటి సన్యాసి నాయుడి నుంచి నగదు స్వాధీనం
విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో ఓ ఇంట్లో నిన్న 26.89 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సెక్టార్-1లో దొరికిన సొమ్ము వైసీపీ ఎమ్మెల్సీకి చెందినదిగా పోలీసులు భావిస్తున్నారు. చోడవరం మండలం జన్నవరానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ కంచిపాటి సన్యాసి నాయుడి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆయన దగ్గర నుంచి నగదుతో పాటు రెండు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com