AP ASSEMBLY: టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

AP ASSEMBLY: టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ అక్రమమంటూ శాసనసభలో ఆందోళన చేపట్టిన తెలుగుదేశం ఎమ్మెల్యేలను స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సస్పెండ్‌ చేశారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. అనంతరం 15 మందిని సస్పెండ్‌ చేయాలంటూ స్పీకర్‌ను ఆయన కోరారు. 14 మంది టీడీపీ సభ్యులు, వైసీపీకు చెందిన ఉండవల్లి శ్రీదేవిని ఒకరోజు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని ప్రకటించారు.

సస్పెండ్‌ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు:

నందమూరి బాలకృష్ణ, కింజరాపు అచ్చెన్నాయుడు బెందాళం అశోక్‌, గద్దె రామ్మోహన్‌, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, పయ్యావుల కేశవ్‌

Next Story