Aadhaar : ఇవాళ్టి నుంచే ఆధార్ క్యాంపులు.. అప్ డేట్ చేసుకోవడం మస్ట్

Aadhaar : ఇవాళ్టి నుంచే ఆధార్ క్యాంపులు.. అప్ డేట్ చేసుకోవడం మస్ట్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో నేటి నుంచి 23వ తేదీ వరకు స్పెషల్‌ ఆధార్‌ క్యాంపులు నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆధార్‌ (Aadhar) అప్‌డేట్‌తో పాటు అన్ని రకాల సేవలు అందించనున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఆధార్‌ తీసుకుని పదేళ్లయిన వారు కచ్చితంగా అప్డేట్‌ చేసుకోవాలని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత ఆగస్టు లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.49 కోట్ల మంది వివరాలను అప్‌డేట్‌ చేసుకోలేదు. 100% ఆధార్‌ డాక్యుమెంట్ అప్డేట్లను సాధించడానికి, ఫిబ్రవరి 20,21,22,23 తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధార్ సేవల గురించి తెలుపుతూ పబ్లిక్ అవేర్నెస్ కోసం మైకులు ఉపయోగించి లేదా చెత్త వ్యాన్ల ద్వారా లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రకటనలు చెయ్యాలని పేర్కొంది. UIDAI సూచనల మేరకు గత పది సంవత్సరాలలో ఒకసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారు గ్రామ సచివాలయాలను సందర్శించి డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. పదేళ్లు అయినా ఒక్క సారి కూడా అప్డేట్ చేసుకొని వారు రాష్ట్రంలో 1.36 కోట్ల మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story