ఏపీలో కొత్తగా 7,956 కరోనా కేసులు
By - shanmukha |14 Sep 2020 2:54 PM GMT
ఏపీలో కరోనా కేసులు ప్రతీరోజూ భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,956 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు.
ఏపీలో కరోనా కేసులు ప్రతీరోజూ భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,956 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,75,079కు చేరింది. అటు, ఈరోజు 60 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,972 చేరింది. మొత్తం కేసుల్లో ఇప్పటి వరకు 4,76,903 కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా, 93,204 మంది చికిత్స పొందుతున్నారు. అయితే, కరోనా కేసులతోపాటు కరోనా టెస్టులు కూడా ఏపీలో రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ మొత్తం 46,61,355 టెస్టులు జరిగాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com