మాజీ ఎంపి మాగంటి బాబు దంపతుల రెండవ కుమారుడు మృతి
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు దంపతుల రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి (రవీంద్ర) మంగళవారం కన్నుమూశారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇటీవల నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.
అక్కడ కొన్ని రోజుల చికిత్స తర్వాత, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే, అతడు ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్ళకుండా హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఉన్నారు. అకస్మాత్తుగా అతని ఆరోగ్యం క్షీణించింది.
బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయని అతడు హోటల్ సిబ్బందికి చెప్పి వైద్యులను పిలిపించమని అడిగాడు. వైద్యులు వచ్చేలోపే బాత్ రూమ్ లో కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు హోటల్ సిబ్బంది పోలీసులకు నివేదించారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు మాగంటి రవీంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేససుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాగంటి బాబు పెద్ద కుమారుడు రామ్జీ కూడా ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.
మాగంటి బాబు ఇద్దరు కుమారులు ఈ విధంగా అకాల మరణం చెందడం కుటుంబాన్ని తీవ్ర దుఖంలో పడేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు మాగంటి దంపతులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com