AP : జగన్ కు ఇవే ఆఖరి ఘడియలు.. నారా లోకేశ్ పంచ్

AP : జగన్ కు ఇవే ఆఖరి ఘడియలు.. నారా లోకేశ్ పంచ్

సీఎం జగన్‌ (CM Jagan), ఆయన సైన్యం చేసే గొడ్డలి దాడులకు ఇవే ఆఖరి రోజులని, దోషులను చట్టం ముందు నిలబెడతామని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh) వెల్లడించారు. బాబాయ్‌పై అబ్బాయి గొడ్డలి వేటేసి అధికారం దక్కించుకున్నాడని అన్నారు. ఆ అధికారం పోతుందనే భయంతో తెలుగుదేశం జెండా పట్టిన కార్యకర్తలపై గొడ్డలి ఎత్తుతున్నారని లోకేష్‌ ఆరోపించారు. మునయ్య కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ప్రజాగళం సభకు వెళ్లాడనే కక్షతో ప్రకాశం జిల్లాకు చెందిన మునయ్య అనే కార్యకర్తను వైసీపీ శ్రేణులు చంపేశాయని టీడీపీ నేత నారా లోకేష్‌ ఆరోపించారు. జగన్‌ గొడ్డలి పార్టీకి రక్తదాహం మరింత పెరిగిపోయిందన్నారు.

గిద్దలూరు మండలం గడికోట పంచాయతీకి చెందిన పాముల మునయ్య టిడిపిలో చేరిన రోజే చంపేస్తామని హెచ్చరించారని లోకేష్‌ తెలిపారు. ఓటమి భయంతో వైసీపీ శ్రేణులు మునయ్యను చంపేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని అన్నారు. అటు మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి లోని వివిధ అపార్టుమెంట్లలో నివసిస్తున్న వారితో నారా లోకేష్‌ భేటీ అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story