Suicide : డాక్టర్ కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య

Suicide : డాక్టర్ కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య

విజయవాడ గురునానక్ నగర్ కాలనీలో విషాదం నెలకొంది. ఓ డాక్టర్ కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి బయట డాక్టర్ డి.శ్రీనివాస్ ఉరేసుకోగా.. ఇంటి లోపల శ్రీనివాస్ భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంఘటనా విషయం తెలిసిన పోలీసులు వెళ్లి పరిశీలిస్తున్నారు. ఈ ఘటన ఆత్మహత్యా? లేక హత్యా? అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు.

పోలీస్‌ కమిషనర్‌ రామకృష్ణ సంఘటనా ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్స్‌ తనిఖీలు నిర్వహించాయి. మృతుల్ని డాక్టర్ శ్రీనివాస్, ఆయన భార్య ఉషారాణి, కుమార్తె శైలజ, తల్లి రమణమ్మ, కుమారుడు శ్రీయాన్‌లుగా గుర్తించారు. కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన తర్వాత డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు.

ఇక కృష్ణా జిల్లా అవనిగడ్డ సబ్ జైల్ నందు జైల్‌వార్డెన్​గా పనిచేస్తున్న దాసరి నాగ శివకుమార్ (37)ఆత్మహత్య చేసుకున్నారు. శివకుమార్ అవనిగడ్డలో తాను నివాసం ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్డెన్​ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story