రాజకీయ కక్షతో పెట్టిన కేసులతో మా వెంట్రుక కూడా పీకలేరు : దేవినేని ఉమ
By - TV5 Digital Team |16 March 2021 7:47 AM GMT
రాజకీయ కక్షతో పెట్టిన కేసులతో మా వెంట్రుక కూడా పీకలేరన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమ. మున్సిపల్ ఫలితాల తరువాత వైసీపీ ప్రభుత్వానికి అధికార మదం తలకెక్కిందని మండిపడ్డారు.
రాజకీయ కక్షతో పెట్టిన కేసులతో మా వెంట్రుక కూడా పీకలేరన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమ. మున్సిపల్ ఫలితాల తరువాత వైసీపీ ప్రభుత్వానికి అధికార మదం తలకెక్కిందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ చంద్రబాబుపై కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అంబేద్కర్ రాజ్యంగం అమలవుతుంటే.. ఏపీలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందన్నారు. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వడం చట్టాలను దుర్వినియోగం చేయడమేనని విమర్శించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com