సంగం డెయిరీలో నాలుగో రోజు ఏసీబీ సోదాలు..!
By - TV5 Digital Team |26 April 2021 8:00 AM GMT
గుంటూరు జిల్లా సంగం డెయిరీలో నాలుగో రోజు ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఏసీబీ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో.. అధికారులు సంగం డెయిరీ ప్రధాన కార్యాలయం చేరుకున్నారు.
గుంటూరు జిల్లా సంగం డెయిరీలో నాలుగో రోజు ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఏసీబీ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో.. అధికారులు సంగం డెయిరీ ప్రధాన కార్యాలయం చేరుకున్నారు. సంగం డెయిరీ పరిపాలన విభాగంలోని పలు బ్లాకుల్లో సోదాలు చేస్తున్నారు. ఉద్యోగుల వివరాలు, వేతనాలు, నియామకాలపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఛాంబర్ల సీజ్, వరుస సోదాలపై యాజమాన్యం, రైతులు ఆందోళనలో ఉన్నారు. అటు... విచారణ పేరుతో సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తున్నారంటున్న డెయిరీ వర్గాలు వాపోతున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com