LOKESH: జగన్‌కు పిచ్చి బాగా ముదిరింది

LOKESH: జగన్‌కు పిచ్చి బాగా ముదిరింది
జగన్‌ కక్షతో రగిలిపోతున్నారన్న నారా లోకేశ్‌... గవర్నర్‌ జోక్యం చేసుకుని కేంద్రానికి నివేదిక పంపాలని విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ ఉన్మాదిలా మారి చంద్రబాబుపై రోజుకో త‌ప్పుడు కేసు పెడుతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. క‌క్షతో ర‌గిలిపోతున్న జ‌గ‌న్ నైజం ఏంటో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యింద‌న్నారు. సీఎం స్థానంలో ఉండి ఉన్మాదిలా మారి, ఏపీ సీఐడీతో ప్రతిపక్ష నేతమీద కేసుల మీద కేసుల పెట్టడం దేశ చరిత్రలో ఎక్కడా లేద‌న్నారు. దిగ‌జారిన జ‌గ‌న్ మాన‌సిక స్థితిపై గ‌వ‌ర్నర్ జోక్యం చేసుకుని కేంద్రానికి నివేదిక పంపాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుపై రోజుకో త‌ప్పుడు కేసు పెడుతోన్న జగన్‌కి పిచ్చి బాగా ముదిరిపోయింద‌ని జ‌నం చ‌ర్చించుకుంటున్నార‌ని తెలిపారు. ప్రతిప‌క్షాన్ని వేధించేందుకు వ్యవ‌స్థల్ని మేనేజ్ చేస్తూ, ఈ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ‌డం దేశంలో ఏ రాష్ట్రంలోనూ జ‌ర‌గ‌లేద‌న్నారు. చంద్రబాబుపై ఆధారాల్లేని త‌ప్పుడు కేసులు వ‌ర‌స‌గా బ‌నాయించ‌డం చూసిన జ‌నం, సిఎం జగన్ కు పిచ్చి బాగా ముదిరిపోయింద‌ని అనుకుంటున్నార‌ని పేర్కొన్నారు.


ప్రజ‌లు ఇచ్చిన అధికారాన్ని, త‌న‌ పిచ్చితో రాజ‌కీయ క‌క్ష సాధింపుల కోసం వాడుకుంటోన్న జ‌గ‌న్ దారుణ పరిస్థితిపై కేంద్రానికి అర్జంటుగా గ‌వ‌ర్నర్ గారు నివేదికలు పంపాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. స్కిల్ డెవ‌ల‌ప్మెంట్లో రూపాయి అవినీతి జ‌ర‌గ‌క‌పోయినా కేసు బనాయించార‌ని, ఈ రోజుకీ ఒక్క ఆధార‌మూ లేద‌ని, వేయ‌ని రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చార‌ని మ‌రో కేసు, ఉచితంగా ఇసుక ఇస్తే అందులో స్కాం అంటూ ఇప్పుడు ఇంకో కేసు, దేశంలోనే పేరుప్రఖ్యాతులు సంపాదించిన ఫైబ‌ర్ నెట్ ప్రాజెక్టుపై మ‌రో కేసు, తాను జె బ్రాండ్స్ అమ్ముతూ చంద్రబాబుపై లిక్కర్ స్కాం కేసు పెట్టిన జ‌గ‌న్ మాన‌సిక ప‌రిస్థితి చూస్తుంటే జాలేయ‌డంతోపాటు ఆందోళ‌న క‌లిగిస్తోంద‌న్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కక్షలు, రాజకీయ వేధింపులు, అస్థిరత్వం, విధ్వంసం వైపు తీసుకెళ్లిన‌ పిచ్చి జ‌గ‌న్ కి అర్జంటుగా పిచ్చి ఆస్ప‌త్రిలో చేర్పించాల‌న్నారు.

ఈ స్థాయిలో పిచ్చి ఉన్న వారు సీఎం కుర్చీలో కూర్చునేందుకు అనర్హులని.. ప్రతి పక్ష నేతపై రోజుకో త‌ప్పుడు కేసు పెట్టడమే తన లక్ష్యం అన్నట్లు జ‌గ‌న్ వ్యవహరించడం దుర్మార్గమైన పాల‌న‌కి నిద‌ర్శన‌మ‌న్నారు. ఎన్నికలు ద‌గ్గర ప‌డుతున్న వేళ‌ తాను రాష్ట్రానికి ఏం చేశానో చెప్పుకోలేక..ఇలా దొంగ కేసులతో ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న జ‌గ‌న్ పిచ్చి పీక్స్ కి చేరింద‌ని దుయ్యబ‌ట్టారు. దేశంలోనే అతి ఎక్కువ కేసులు, లెక్కలేన‌న్ని ఆస్తుల‌తో కరప్ట్ పొలిటీషియన్ గా ముద్రపడిన జగన్‌ ఆ బురదను చంద్రబాబుకూ అంటించాలని చూస్తుండ‌డం దారుణ‌మ‌న్నారు.

Tags

Read MoreRead Less
Next Story