Nara Lokesh: మంత్రులు, వైసీపీ నేతలకు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్
By - Prasanna |26 Sep 2022 9:00 AM GMT
Nara Lokesh: మంత్రులు, వైసీపీ నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Nara Lokesh: మంత్రులు, వైసీపీ నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పేటీఎం డాగ్స్.. దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు అంటూ ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. అవినీతి కేసుల్లో వైఎస్సార్ను ప్రథమ ముద్దాయిని చేసింది.. స్వయంగా జగనే అని గతంలో ఉండవల్లి అరుణ్కుమార్ చెప్పారని లోకేష్ తెలిపారు.
సుప్రీంకోర్టు వరకు వెళ్లి రాజశేఖర్రెడ్డి, ఆయన మంత్రివర్గం కలిసి చేసిన తప్పిది.. నాకేంటి సంబంధం అని అప్పట్లో జగన్ అన్నారని ఉండవల్లి చెప్పిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. గతంలో ఉండవల్లి చేసిన వ్యాఖ్యల వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసారు. వైసీపీ నేతల్లాగ ఆధారాలు లేని ఆరోపణలు చేయడం లేదన్న నారా లోకేష్.. పక్కా ఆధారాలతో బయట పెడుతున్నానని తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com