Prakasam: ఒకే ప్లాట్‌ నెంబరుతో ముగ్గురికి పట్టాలు.. జగనన్న ఇళ్ల స్థలాల విషయంలో గోల్‌‌మాల్..

Prakasam: ఒకే ప్లాట్‌ నెంబరుతో ముగ్గురికి పట్టాలు.. జగనన్న ఇళ్ల స్థలాల విషయంలో గోల్‌‌మాల్..
Prakasam: ప్రకాశం జిల్లాలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల జగనన్న ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Prakasam: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల జగనన్న ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.. ఒక ప్లాట్‌ను ఇద్దరు ముగ్గురికి పట్టాలు ఇవ్వడంతో స్థలంలో లబ్ధిదారులు గొడవలు పడుతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే, సమస్యను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు రెండేళ్లుగా తాత్సారం చేస్తున్నారు.. దీంతో చేసేది లేక బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించారు.

దీంతో స్పందించిన ఉన్నతాధికారులు ఎర్రగొండపాలెం రెవెన్యూ అధికారులకు చీవాట్లు పెట్టారు. లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాలను వెరిఫై చేసి వారికి న్యాయం చేయాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది తప్పు సరిదిద్దుకునే పనిలో పడ్డారు. మొన్నటి వరకు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారని.. ఇప్పుడు కాలనీ చుట్టూ తిప్పుతున్నారని బాధితులు మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story