West Bengal: పనిచేయని పారాచ్యూట్, నేవీ కమాండర్ మృతి
By - Subba Reddy |6 April 2023 6:30 AM GMT
పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పారాట్రూపర్స్ ట్రైనింగ్ టీమ్లో కమాండోగా గోవింద్ విధులు నిర్వహిస్తున్నారు. శిక్షణలో భాగంగా ఆయన ఎయిర్క్రాఫ్ట్ నుంచి కిందకి దూకగా.. పారాచ్యూట్ పూర్తిగా తెరుచుకోలేదు. దీంతో తీవ్ర గాయాలై మృతి చెందారు. గోవింద్ స్వగ్రామం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామం. గత ఏడాది గోవింద్ తండ్రి చనిపోయినప్పటి నుంచి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారాయన. ప్రమాదంలో గోవింద్ కూడా చనిపోవడంతో కుటంబంలొ విషాదచాయలు అలముకున్నాయి. కమాండర్ గోవింద్ మృత దేహం కాసేపట్లో స్వగ్రానికి చేరుకోనుంది. అధికారక లాంఛనాలతో గోవింద్ అంత్యక్రియలు జరగనున్నాయి.నేవి అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com