Charan - Janhvi : చరణ్-జాన్వీతో సీక్వెల్ తీయాలి.. చిరంజీవి మనోగతం

Charan - Janhvi : చరణ్-జాన్వీతో సీక్వెల్ తీయాలి.. చిరంజీవి మనోగతం

చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేక వీరుడు- అతిలోక సుందరి తెలుగు సినిమా హిస్టరీలోనే ఓ క్లాసికల్ బ్లాక్ బస్టర్. ఆ మూవీకి సీక్వెల్ రావాలనేది చిరంజీవి చిరకాల వాంఛ. తన కొడుకు రామ్ చరణ్‌, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ చేస్తే ఈ మూవీకి హైప్ వస్తుందని చిరంజీవి మనసులో మాట. ఆ విషయాన్ని రీసెంట్ గా ఆయన బయటపెట్టాడు.

జాన్వీ కపూర్ దేవర`తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది. ఐతే.. చరణ్‌తోనూ డైరెక్టర్ బుచ్చిబాబు సినిమాలో జాన్వీ చేస్తోంది. వీరిద్దరూ కలిసి చేస్తే 'జగదేక వీరుడు..' సీక్వెల్ మరో సినిమా అవుతుందన్నమాట. చిరంజీవి ఈ మధ్య ఓ ఈవెంట్ లో `జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ గా రావాలి, అందులో చరణ్‌, జాన్వీ కలిసి నటించాలి అంటూ తన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఈ సీక్వెల్ చూడాలన్నది తన కల అన్నారు. దీంతో.. ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

ఆ మూవీకి సీక్వెల్ తీయకపోయినా.. అదే సినిమాను రీమేక్ చేసిన చాలు అంటున్నారు ఫ్యాన్స్. లేటెస్ట్ టెక్నాలజీ, గ్రాఫిక్స్ తో అద్భుతం అనిపించేలా ఉంటుందనేది కొందరి అభిప్రాయం. ఇన్ స్టంట్ గా కోట్ల రూపాయలు తెచ్చిపెట్టే ఈ ప్రాజెక్టు ఎవరు చేపడతారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story