Kantara : రిషబ్ శెట్టి సొంత ఊర్లోనే కాంతార కోసం భారీ సెట్

Kantara : రిషబ్ శెట్టి సొంత ఊర్లోనే కాంతార కోసం భారీ సెట్

కాంతార (Kantara) మూవీ దేశ సినీ పరిశ్రమలో కన్నడ సీమ సృష్టించిన ఓ సంచలనం. 2022లో విడుదలైన 'కాంతార' దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. కన్నడ చిత్రసీమ ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసింది. బాక్సాఫీసు దగ్గర ఈ చిత్రానికి తిరుగులేని వసూళ్లు దక్కాయి. ఇప్పుడు అందరి దృష్టీ 'కాంతార 2'పైనే.

2023లోనే సీక్వెల్ వస్తుందని మొదట తెలిపినప్పటికీ క్వాలిటీలో రాజీ పడటం లేదు మేకర్స్. సో మేకింగ్ కొంత లేట్ అవుతోంది. ఇప్పుడు ఈ సీక్వెల్ పట్టాలెక్కడానికి రంగం సిద్ధమైంది. వచ్చే నెలలో కాంతార 2 సెట్స్‌పైకి వెళ్తుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఇది సీక్వెల్ కాదు. ప్రీక్వెల్. కాంతార కథ ఎక్కడైతే మొదలైందో, అంతకు ముందు జరిగిన సంఘటనలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.

డివోషనల్ బ్లాక్ బస్టర్ 'కాంతార'తో పోలిస్తే.. 'కాంతార 2'లో రిషబ్ శెట్టి పాత్ర వినూత్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం రిషబ్ సొంతూరు కదిరిలో.. ఓ భారీ సెట్ తీర్చిదిద్దారు. అక్కడే సింహభాగం షూటింగ్ జరగబోతోంది. 'కాంతార 2'లో కొంతమంది బాలీవుడ్ నటీనటులు కనిపిస్తారని, కథానాయిక కూడా మారబోతోందన్న ప్రచారంలో వాస్తవం లేదంటోంది యూనిట్. దక్షిణాది నటులతోనే 'కాంతార 2'ని పూర్తి చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story