పోలీసులపై పూలవర్షం కురిపించిన స్థానికులు
By - TV5 Telugu |6 Dec 2019 5:04 AM GMT
దిశ హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై మహిళా లోకం హర్షిస్తోంది. నల్గొండ జిల్లాలో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై ఆకృత్యాలకు పాల్పడాలంటే భయపడేలా చేశారని అభిప్రాయ పడుతున్నారు. కామాంధుల ఎన్కౌంటర్తో ఇకనైనా మహిళలపై అత్యాచారాలు, హత్యలకు బ్రేక్ పడుతుందని ఆశిస్తున్నామని అన్నారు. తెలంగాణ పోలీసులు.. దిశకు నిజమైన ఘన నివాళిని ఇచ్చారని మహిళలోకం అభిప్రాయపడుతుంది. స్పాట్కు వెళ్లిన పోలీసులపై స్థానికులు పూలవర్షం కురిపించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com