Bihar: భయపడి ఫోన్ మింగేశాడు...
బీహార్ జైల్లో వింత ఘటన చోటుచేసుకుంది. ఆకస్మిక తనిఖీకి వచ్చిన అధికారులకు దొరికిపాతానేమోనని భయపడిన ఓ ఖైదీ తన వద్ద ఉన్న సెల్ ఫోన్ ను అమాంతం మింగేశాడు. దీంతో ప్రస్తుతం చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లా జైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం అలీ అనే ఖైదీకి సెల్ ఫోన్ మింగిన కాసేపటికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చిందని తెలుస్తోంది. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అతడి కడుపులో ఏదో వస్తువు ఉందని గుర్తించినట్లు వైద్యు ధృవీకరించారు. తదుపరి చికిత్స కోసం అలీని పాట్నా వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. డ్రగ్స్ నివారణ చట్టంలో భాగంగా 2020లో అలీ అరెస్ట్ అయ్యాడు. బీహార్ లోని జైళ్లలో ఖైదీల సెల్ ఫోన్ ల వాడకం పై సమాచారం అందడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జైళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇప్పటి వరకూ 35సెల్ ఫోన్ లు, ఏడు సిమ్ కార్డ్ లు, 12 సెల్ ఫోన్ ఛార్జర్లను స్వాధీనం చేసుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com