రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతంపై దృష్టి పెట్టిన అమిత్షా
కేంద్రహోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్షా.... రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం, కేంద్ర పథకాల అమలుపై దృష్టి పెట్టారు. ఇందుకోసం శనివారం బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ ఎంపీలతో వీడియో కాన్ఫ్రెన్స్ నిర్వహించారు. ఢిల్లీలోని పార్టీ ఆఫీస్లో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో వర్కింగ్ ప్రసిడెంట్ జేపీ నడ్డాతో పాటు పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు...
ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్రాల్లో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను.. మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు సూచించారు అమిత్ షా. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎన్డీఏ సర్కారు చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలన్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్ధితులను, అభివృధ్ది పనులను సీఎంలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ చాలా పటిష్టంగా ఉందని... అభివృధ్ది పనులు బాగా జరుగుతున్నాయని బీజేపీపాలిత రాష్ట్రాల సీఎంలు అమిత్షాకు వివరించారు...
ఇక అక్టోబర్ 2న మహాత్మా గాంధీ 150వ జన్మదిన వేడుకల నిర్వహణపై సీఎంలకు దిశానిర్దేశం చేశారు అమిత్షా. గాంధీ జయంతి వేడుకలను దేశమంతటా ఘనంగా నిర్వహించాలని సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో.. గాంధీ జయంతిని పండుగలా నిర్వహించాలన్నారు. ఎంపీలు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించాలని వేడుకల విషయంలో రాజీపడొద్దంటూ సీఎంలు, ఎంపీలకు సూచించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com