కరోనా వ్యాక్సిన్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
By - TV5 Digital Team |23 March 2021 11:00 AM GMT
కరోనా వ్యాక్సిన్పై కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ తప్పని సరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.
కరోనా వ్యాక్సిన్పై కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ తప్పని సరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత లేదని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టంచేశారు. అర్హులైన వారందరు తమ పేర్లను తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. శాస్త్రవేత్తల సూచనల మేరకు వ్యాక్సిన్ తొలి డోసు, కోవిషీల్డ్ తీసుకున్న వారు 4, 8 వారాల్లో రెండో డోసు వేసుకోవాలని ప్రకాశ్ జవదేకర్ స్పష్టంచేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com