Delhi Liquor Scam: నిందితులకు భారీ షాక్‌

Delhi Liquor Scam:  నిందితులకు భారీ షాక్‌
బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన సీబీఐ ప్రత్యేక కోర్టు

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో నిందితులకు భారీ షాక్‌ తగిలింది. బెయిల్‌ ఇచ్చేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. నిందితులు శరత్‌చంద్రారెడ్డి, విజయనాయర్‌, సమీర్‌ మహేంద్రు, వినయ్‌బాబు, అభిషేక్‌ బోయిన్‌పల్లి బెయిల్‌ పిటిషన్‌లను న్యాయమూర్తి తోసిపుచ్చారు. అయితే ప్రత్యేక కోర్టు తీర్పుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే యోచనలో నిందితులు ఉన్నట్లు తెలుస్తోంది.

కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్‌ ఇవ్వొద్దని ఈడీ న్యాయవాదులు గట్టిగా వాదనలు వినిపించారు. బెయిల్‌ పిటిషన్‌లపై తీర్పు రిజర్వ్‌ అయిన తర్వాత స్కాంలో మరికొంతమందిని ఈడీ అరెస్ట్‌ చేసింది. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు నేపథ్యంలో ఈడీ మరింత దూకుడుగా వెళ్లనుంది. త్వరలోనే మరికొంతమందిని ఢిల్లీకి పిలిపించి విచారించే అవకాశం ఉంది. పలువురు కీలక వ్యక్తులకు సంబంధించిన ఆధారాలను ఇప్పటికే ఈడీ సిద్ధం చేసినట్లు సమాచారం. ఆ ఆధారాల ప్రాతిపదికగా కీలక వ్యక్తులకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించనుంది.

Tags

Read MoreRead Less
Next Story