Hyderabad: ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి

Hyderabad: ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి
ఢిల్లీలోని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై అర్థరాత్రి దుండగులు రాళ్ల దాడి

ఢిల్లీలోని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై అర్థరాత్రి దుండగులు రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడితో ఒవైసీ ఇంటి కిటికీలు పగులగొట్టారు.సమాచారం అందుకున్న ఢిల్లీ అదనపు డీసీపీ నేతృత్వంలోని పోలీసుల బృందం ఒవైసీ ఇంటికి వెళ్లి సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది.ఈ ఘటనను ఢిల్లీ పోలీసులు ధృవీకరించారు.

దుండగుల రాళ్ల దాడిలో ఇంటి కిటికీలు ధ్వంసమయ్యాయి. రాజస్థాన్‌ పర్యటనలో ఉన్న తాను ఢిల్లీలోని తన నివాసానికి చేరుకునేసరికి కిటీకి అద్దాలు పగిలిపోయాయని..ఇంటి చుట్టూ రాళ్లు పడి ఉన్నాయని పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ చేశారు అసదుద్దీన్‌ తన నివాసంపై దాడి చేయడం ఇది నాలుగోసారి.. తన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో తగినంత సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని.. వాటిని యాక్సెస్ చేయవచ్చని, నిందితులను వెంటనే పట్టుకోవాలని ఫిర్యాదులో తెలిపారు అసదుద్దీన్ ఒవైసీ. ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ ఫిర్యాదు అందుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారిని విచారిస్తున్నారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story