బ్లూటూత్ హెడ్ఫోన్స్ పేలి యువకుడు మృతి..
ఇప్పటి వరకు ఫోన్లు పేలడం తెలుసు.. ఇప్పుడు ఇయర్ ఫోన్స్ కూడా పేలుతున్నాయని తెలుస్తోంది. తాజాగా బ్లూటూత్ హెడ్ఫోన్ పరికరం పేలడంతో 28 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
జైపూర్ జిల్లాలోని చోము పట్టణంలోని ఉదైపురియా గ్రామంలో నివసిస్తున్న రాకేశ్ కుమార్ తన నివాసంలో పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఫోన్ ఛార్జింగ్లో పెట్టి దానికి బ్లూటూత్ కనెక్ట్ చేశాడని పోలీసులు తెలిపారు.
ఈ పరికరం ఒక్కసారిగా పేలిపోవడంతో రాకేశ్ స్పృహ కోల్పోయాడు. కుటుంబసభ్యులు అతడిని వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో అతను మరణించాడు. బ్లూటూత్ పేలడంతో అతని చెవులకు గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు. కాగా, రాకేష్ ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com