Adipurush: ఆదిపురుష్ రామ కోటి ఉత్సవం

Adipurush: ఆదిపురుష్ రామ కోటి ఉత్సవం
రెబల్‌స్టార్‌ ప్రభాస్ రాముడి పాత్రలో కృతి సనన్ సీత పాత్రలో నటించిన ఇతిహాసిక చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాను బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ రూపొందించారు

రెబల్‌స్టార్‌ ప్రభాస్ రాముడి పాత్రలో కృతి సనన్ సీత పాత్రలో నటించిన ఇతిహాసిక చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాను బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ రూపొందించారు. అయితే ఈ సినిమాను తెలుగులోకి పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పథాకంపై ప్రముఖ నిర్మాత నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. పోయిన శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆదిపురుష్ మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో రామ జయం, రఘురామ జయం పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాటల రచయిత భీమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ యుగాలు, తరాలు మారినా రామ కథ మారదన్నారు. రాముడి మీద మనకున్న భక్తి, గౌరవం మారదు. తెలుగు ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదిపురుష్ చిత్రాన్ని చూస్తున్నారు. ఈ చిత్రానికి పనిచేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు.

మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ .. ఆదిపురుష్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. నైజాంలో దాదాపు 500 స్క్రీన్స్ కి పైగా సినిమాను రిలీజ్ చేశాం. యువత ఒక అంచనాతో సినిమాకు వచ్చారు. 20 ఏళ్లలోపు పిల్లలంతా సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభాస్, ఓం రౌత్ చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యిందన్నారు. తొలి రోజు నైజాంలో 13.65 కోట్ల రూపాయలు వసూళ్లు అయ్యాయన్నారు. ఇది ఒక స్టార్ హీరోకు రికార్డ్ స్థాయి కలెక్షన్, రెండో రోజు దాదాపు 8 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు. థియేటర్ల దగ్గర ప్రేక్షకుల స్పందన బాగుంది. కలెక్షన్స్ స్థిరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ .. ఈ సినిమాలో అన్ని పాటలు నేనే రాస్తానని అడిగి మరీ తీసుకున్నానని తెలిపారు. యూవీ సంస్థతో నాకున్న అనుబంధం అలాంటిదని గుర్తు చేసుకున్నారు. ఐదు పాటలు, మూడు బిట్ సాంగ్స్ రాశాను. అన్నింటికీ మంచి పేరు దక్కిందని పేర్కొన్నారు. జ్యూక్ బాక్స్, పాటలకు అద్భుతమైన ఆదరణ వస్తుందని వెల్లడించారు. ఈ చిత్ర విజయంలో నా పాటలు భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.

సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ .. నిన్నటి వరకు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా కోటి మంది ప్రేక్షకులు చూశారని, అందుకే ఈ సభను రామకోటి ఉత్సవంగా పిలవాలని అనుకున్నామన్నారు. ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరూ అనుకున్నది ఏంటంటే..రామనామాన్ని ప్రతి గడపకు చేర్చాలనుకున్నామన్నారు. ఆ ప్రయత్నంలో మేము సఫలీకృతం అయ్యామని పేర్కొన్నారు. ట్రోల్ చేసేవారు కూడా పరోక్షంగా రాముడిని తలుచుకుంటున్నారని తెలిపారు. ఎన్ని కాంట్రవర్సీలు వస్తున్నాయో అంతకంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story