అయోధ్య రామ మందిరం.. మొదటి రోజే 5 లక్షల మంది పైగా భక్తుల దర్శనం

అయోధ్య రామ మందిరం.. మొదటి రోజే 5 లక్షల మంది పైగా భక్తుల దర్శనం
దాదాపు నెల రోజుల నుంచి అయోధ్య రామ మందిరం గురించిన ప్రచారంతో మీడియా హోరెత్తించింది.

దాదాపు నెల రోజుల నుంచి అయోధ్య రామ మందిరం గురించిన ప్రచారంతో మీడియా హోరెత్తించింది. దాంతో ఆ అయోధ్యారాముడిని ఒక్కసారైన దర్శించే భాగ్యం కలగాలని భక్తులు ఆశించారు. అందుకే ప్రారంభోత్సవ వేడుక ముగిసిన వెంటనే దేశంలోని భక్తులంతా అయోధ్యకు క్యూ కడుతున్నారు. దాదాపు 5 లక్షల మంది భక్తులు అయోధ్యలోని రామ మందిరంలో రామలల్ల దర్శనానికి మొదటి రోజు హాజరయ్యారని ఆలయ ట్రస్ట్ తెలిపింది.

జనవరి 22న 'ప్రాణ్ ప్రతిష్ఠ' కార్యక్రమం నిర్వహించిన తర్వాత మంగళవారం రామాలయాన్ని సాధారణ ప్రజల దర్శనార్థి తెరిచి ఉంచారు. రామ్ లల్లా దర్శనం 1వ రోజున, అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి దాదాపు 3 లక్షల మంది భక్తులు విచ్చేశారని ఆలయ అధికారులు తెలిపారు. అదే సంఖ్యలో భక్తులు బయట కూడా ఉన్నారు. బాల రాముని దర్శనం కోసం ఎదురుచూస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. అయోధ్యలోని రామాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ అధికారులు ఆలయ ప్రాంగణంలో భక్తుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు.

పరిస్థితిని అంచనా వేసేందుకు ఉత్తరప్రదేశ్ స్పెషల్ డిజి (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్) 'గర్భ గృహ' లోపల ఉన్నారు. అధికారుల ప్రకారం, పరిస్థితిని నియంత్రించడానికి 8,000 మందికి పైగా భద్రతా సిబ్బంది ఉన్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని పూజలు చేశారు."మేము చాలా సంతోషంగా ఉన్నాము. మరి కొద్దిసేపటిలో రామ్ లల్లా 'దర్శనం' చేయబోతున్నాము అనే వాస్తవం మమ్మల్ని మరింత ఉత్సాహానికి గురి చేస్తోంది అని చండీగఢ్‌కు చెందిన తేజేందర్ సింగ్ అనే భక్తుడు అన్నారు.

ఆలయ ద్వారాల వద్ద గుమిగూడిన భారీ జనసందోహం గురించి ఆయన మాట్లాడుతూ.. లక్షలాది మందికి శ్రీరాముడి దర్శనం చేసుకోవాలని ఉంటుంది కాబట్టి రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం తాను ఒడిశా నుంచి వచ్చానని మరో భక్తుడు చెప్పాడు.

"నేను ఒడిశాలోని పూరి నుండి అయోధ్యకు బైక్‌పై వచ్చాను. ఇది 1224 కిలోమీటర్ల ప్రయాణం. నేను రామ్‌లల్లాను 'దర్శనం' చేసుకోవాలని చాలా ఆత్రుతగా ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నానని అందరూ నన్ను అడిగారు. అప్పుడు నేను 500 ఏళ్లుగా నిర్మించబడని ఆలయంలో రాముడి దర్శనం చేసుకోబోతున్నానని చెప్పాను, ”అని అతను చెప్పాడు.

అయోధ్యలోని శ్రీరామ్ లల్లా యొక్క 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు అర్చకులు.

Tags

Read MoreRead Less
Next Story