Train on Fire : న్యూఢిల్లీ-దర్భంగా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మంటలు
న్యూఢిల్లీ నుంచి బీహర్లోని దర్భంగా వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. గమనించిన కొందరు ప్రయాణాకులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు నుంచి కిందకు దూకారు. ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీ-దర్భంగా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లోని స్లీపర్ కోచ్ నుంచి పొగలు రావడాన్ని సరాయ్ భూపత్ స్టేషన్ మాస్టర్ గమనించారు. వెంటనే లోకోపైలట్ను అలెర్ట్ చేసి రైలును ఆపించారు. ఆ కోచ్లో మంటలు చెలరేగడంతో అందులోని ప్రయాణికులు కిందకు దూకారు.
వరుస రైలు ప్రమాద ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లో ఇటావా దగ్గర రైలులో మంటలు చెలరేగగా.. మూడు బోగీలు దగ్ధం అయ్యాయి. యూపీలోని ఇటావా సమీపంలోని సరాయ్ భూపత్ స్టేషన్ దగ్గరలో బుధవారం సాయంత్రం వేళ ఈ ఘటన జరిగనట్లు రైల్వే అధికారులు తెలిపారు. న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్ప్రెస్.సరాయ్ భూపత్ స్టేషన్ దాటిపోతున్న క్రమంలో స్లీపర్ కోచ్ నుంచి అకస్మాత్తుగా పొగలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన స్టేషన్ మాస్టర్.. వెంటనే ట్రైన్ పైలట్, గార్డ్కు సమాచారం అందించాడు. దీంతో దీంతో రైలును అక్కడికక్కడే నిలిపేశాడు.
ట్రైన్ ఆపగానే ప్రయాణికులందరూ ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని అధికారులు పేర్కొన్నారు. రైలుకు పూర్తి స్థాయిలో మంటలు అంటుకోగా.. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com