Delhi Paint Factory : పెయింట్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం, 11మంది మృతి

Delhi Paint Factory : పెయింట్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం, 11మంది మృతి

దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) అలీపూర్ ప్రాంతంలోని ప్రధాన మార్కెట్‌లో గురువారం (ఫిబ్రవరి 15) సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.

మంటలు చెలరేగిన కొద్దిసేపటికే అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అపే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. 22 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి.

అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లో ఉన్న ఫ్యాక్టరీ ప్రాంగణంలో ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS)కి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ సాయంత్రం 5.25 గంటలకు తమకు కాల్ వచ్చిందని, వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయని చెప్పారు.

రాత్రి 9:00 గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తెచ్చామని, కూలింగ్ ఆఫ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదానికి ముందు ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అగ్నిమాపక శాఖ తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదానికి ముందు ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు బృందాలను ఏర్పాటు చేశామని ఓ అధికారి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story