Puni : మహరాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం

Puni : మహరాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం
ఎలక్ట్రిక్ హార్డ్ వేర్ షాపులో మంటలు.. నలుగురు మృతి

మహారాష్ట్రలో పూణేలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లాలోని పింప్రి-చించ్వాడ్‌లోని పూర్ణానగర్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.. అసలు ప్రమాదం ఎలా జరిగిందో క్లారిటీ రావడం లేదన్న పోలీసులు, త్వరలోనే ఇందుకు కారణం ఏంటో గుర్తిస్తామని తెలిపారు.

పింప్రీ చించ్‌వాడ్ అగ్నిమాపక దళం అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున 5.25 గంటల ప్రాంతం లో దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. ఈ ప్రమాదం పై స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అయితే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడి వేగంగా వ్యాపించడంతో నలుగురు మృతి చెందారు. మృతులను చిమ్నారం బెనారం చౌదరి (48), అతని భార్య నమ్రత (40), వారి ఇద్దరు కుమారులు భావేష్ (15), సచిన్ (13) గా గుర్తించారు.. రాజస్థాన్‌లో ని పాలికి చెందిన ఈ కుటుంబం షాహునగర్‌లో సచిన్ హార్డ్‌వేర్ అండ్ ఎలక్ట్రికల్స్ అనే హార్డ్‌వేర్ దుకాణాన్ని నడుపుతోంది.. మృత దేహలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన పై అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నారు.. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..

Tags

Read MoreRead Less
Next Story