Karnataka: ఇంట్లో తల్లి సహా ముగ్గురు చిన్నారుల మృతదేహాలు
మహిళ, ఆమె ముగ్గురు పిల్లలను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. మల్పే పోలీస్ స్టేషన్ పరిధిలోని తృప్తి నగర్లోని వారి ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి ఏదో సమస్యపై మహిళతో గొడవ పడ్డాడని ప్రాథమిక సమాచారం.
ఈ దాడిలో మరో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. కత్తి పోటు వల్ల 46 ఏళ్ల హసీనా, 23, 21, 12 ఏళ్ల వయసున్న ఆమె ముగ్గురు పిల్లలు మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఉడిపి జిల్లా ఎస్పీ అరుణ్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతురాలి భర్త గల్ఫ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. మహిళ, ఆమె ముగ్గురు పిల్లల హత్యకు కారణం ఏమిటన్నదని తెలియదని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
దాడి చేసిన వ్యక్తి మొదట మహిళ హసీనా, ఆమె పిల్లలు అఫ్నాన్, ఐనాజ్లను కత్తితో పొడిచాడు. అసిమ్ అరుపులు విని బయట ఆడుకుంటున్న మరో చిన్నారి ఇంట్లోకి పరిగెత్తడంతో దాడి చేసిన వ్యక్తి అతడిని కూడా చంపేశాడు. దీంతో పాటు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ అత్తగారిపై కూడా దాడి జరిగింది. పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఎలాంటి బంగారం, నగదు చోరీకి గురికాలేదు. మల్పే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com