Bihar: బీహార్లో జేడీయూ నేత హత్య
లోక్సభ ఎన్నికల వేళ బీహార్లో జేడీయూకి చెందిన రాజకీయ నేత సౌరభ్ కుమార్ హత్యకు గురయ్యారు. రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. పాట్నాలోని పున్పున్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. వివాహ వేడుకకు హాజరయ్యి తిరిగి వెళ్తున్న సమయంలో దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పున్పున్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 24న అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగిందని, ఇద్దరు వ్యక్తులే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారని, సౌరభ్ కుమార్ చనిపోయారని పోలీసులు తెలిపారు. సౌరభ్ స్నేహితుడు మున్మున్ తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. మృతి చెందిన జేడీయూ నేత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన తర్వాత ఆగ్రహించిన ప్రజలు పాట్నా-గయా రహదారిని దిగ్బంధించారు.
ఈ కాల్పుల ఘటనతో పున్పున్ ఏరియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పుల ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో నిరసనలు తెలిపారు. రోడ్డుపై బైఠాయించడంతో 86వ నంబర్ జాతీయ రహదారిపై కొన్ని గంటలపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా సేపటి తర్వాత నిరసనకారులను పోలీసులు శాంతింపజేశారు.సౌరభ్ కుమార్కు 2 బుల్లెట్ గాయాలయ్యాయని, అతడి స్నేహితుడు మున్మున్ కుమార్కు బుల్లెట్లు తగిలాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాజకీయ వైరంతోనే ఈ హత్య జరిగిందా? ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటన సమాచారం అందిన వెంటనే పాట్లీపుత్ర ఆర్జేడీ అభ్యర్థి, లాలూ ప్రసాద్ కుమార్తె మిసా భారతి పున్పున్కు చేరుకుని సౌరభ్ కుమార్ కుటుంబ సభ్యులను కలిశారు. పాట్నా పోలీసుల ప్రత్యేక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సౌరభ్ తలపై రెండు బుల్లెట్లు, అతని సహచరుడు మున్మున్కు మూడు బుల్లెట్లు తగిలాయి. తలలో రెండు బుల్లెట్లు తగలడంతో సౌరభ్ కుమార్ మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. ఇంతలో అతని భాగస్వామి మున్మున్ గాయపడి పాట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com