Jharkhand : జార్ఖండ్ నోట్ల గుట్ట కేసులో ఇద్దరి అరెస్టు

Jharkhand : జార్ఖండ్ నోట్ల గుట్ట కేసులో ఇద్దరి అరెస్టు

జార్ఖండ్ మంత్రి పిఎస్ నౌకరు ఫ్లాట్లో రూ. 34.23 కోట్లు స్వాధీనం చేసుకున్నారు రాంజీ పోలీసులు. జార్ఖండ్ మంత్రి ఆలంగిర్ అలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ను, ఆయన నౌకరు జహంగిర్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళ వారం అరెస్టు చేసింది. జహంగీర్ ఇంటిలోని గదిలో సోమవారం రూ. 34.28 కోట్ల లెక్కల్లో చూపని నగదును ఇడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సోమవారం రాత్రి వారిద్దరినీ ప్రశ్నించిన ఈడీ అధికారులు సిఎం ఎల్ఎ నిబంధనల కింద అదుపులోకి తీసుకున్నారు. ఈ డబ్బుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, తాను ఏ తప్పూ చేయలేదని 20 ఏళ్ల కాంగ్రెస్ నాయకుడు, జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి మంత్రి అలంగర్ స్పష్టం చేశారు. 2023 ఫిబ్రవరిలో అరెస్టు చేసిన జార్ఖండ్ గ్రామీణ పనుల శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కె రామ్ పై నమోదైన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి సంజీవ్ లాల్ నౌకరు ఉంటున్న ఫ్లాట్ కోసహా రాంచి లోని అనేక నివాసాలపై ఈడీ అధికారులు సోమవారం దాడులు జరిపారు.

గ్రామీణ పనుల శాఖలో కొన్ని పథకాల అమలులో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. సంజీవ్ లాల్ నౌక జహంగీర్ ఉంటున్న ఫ్లాట్ నుంచి భారీ మొత్తంలో నగదు, బంగారు నగలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story